
దేశంలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గతేడాదితో పోల్చితే సెకండ్ వేవ్ మరింత డేంజరస్గా మారి నిత్యం వేల సంఖ్యలో మరణాలకు కారణమవుతోంది. సినీ ఇండీస్ట్రీలో ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో కరోనా బారినపడి ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ (66) కన్నుమూశారు. ఈ విషాదవార్త విని పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. రీసెంట్గా శ్రవణ్ కుమార్ రాథోడ్కి కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఆయనను ముంబైలోని రహేజా హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. అయితే గత రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్య బృందాలు తీవ్రంగా శ్రమించాయి. కానీ చికిత్స జరుగుతుండగానే శ్రవణ్ కుమార్ రాథోడ్ గత రాత్రి (గురువారం) తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్ స్టార్ హీరో సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు. బాలీవుడ్కి చెందిన మరో మ్యూజిక్ డైరెక్టర్ నదీమ్తో కలిసి అప్పట్లో ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించారు శ్రవణ్ కుమార్ రాథోడ్. 1990 నుంచి 2000 మధ్యకాలంలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది ఈ జంట. నదీమ్- శ్రవణ్ జంట బాణీలు కట్టిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ''ఆషీకీ, సాజన్, సడక్, దీవానా, దిల్ హైకీ మాంతా నహీ, హమ్ హై రాహీ ప్యార్ కే, ఫూల్ ఔర్ కాంటే, పర్దేశ్'' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఘనత నదీమ్- శ్రవణ్ జోడీది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gyv74w
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.